‘డిక్టేటర్‌’ తొలి టికెట్‌ను మూడన్నర లక్షల పెట్టి కొనుగోలు చేసిన అభిమాని!


నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, వేదాశ్వ క్రియేష‌న్స్ నిర్మించిన చిత్రం ‘డిక్టేట‌ర్‌’. సెన్సార్ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా బాల‌య్య న‌టించిన 99వ చిత్రం కావ‌డంతో సినిమా భారీ అంచ‌నాలు నెలకొన్ని ఉన్నాయి. మ‌రోవైపు ఈ సినిమాను ఓవ‌ర్‌సీస్ కొన్న డిస్ట్రిబ్యూట‌ర్ తొలి టికెట్‌ను వేలం వేశాడ‌ట‌. ఓ నంద‌మూరి అభిమాని తొలి టికెట్‌ను 5555 డాల‌ర్ల‌కు పాడుకున్నాడ‌ట‌. మ‌న ఇండియ‌న్ క‌రెన్సీ ప్ర‌రారం దాదాపు మూడున్న‌ర ల‌క్ష‌లట‌. ఈ విలువ తెలియ‌గానే అంద‌రూ షాక్ అవుతున్నారు. నంద‌మూరి ప్రాభ‌వం ఎక్కువుగా ఉండే రాయ‌ల‌సీమ‌లో ఈ సినిమా టికెట్‌ న‌ల‌బై వేల‌కు ఓ అభిమాని సొంతం చేసుకున్నాడ‌ట‌. ఇదే విధంగా, పలు ఏరియాల్లో డిక్టేటర్‌ తొలి టికెట్‌ను వేలం వేసి అమ్ముతున్నారట. బాలయ్య మీద అభిమానంతో.. ఆయన వీరాభిమానులు వేలకు వేలు ఖర్చుచేసి తొలి టికెట్‌ను సొంతం చేసుకుంటున్నారట.  డిక్టేట‌ర్ సినిమాకు ముందు.. ఏ హీరో సినిమా టికెట్ ఇంత భారీ రేట్‌కు అమ్ముడుపోలేద‌నేది వాస్త‌వం.
Previous
Next Post »